నల్లమల్ల తేనెను మంత్రికు అందజేసిన ఎమ్మెల్యే

రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తేనెను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.

Update: 2024-10-02 13:14 GMT

దిశ, అచ్చంపేట/అమ్రాబాద్ : రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తేనెను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. శ్రీశైలం మల్లికార్జున దేవస్థానాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు మన్ననూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కలిసి నల్లమల్ల ప్రాంతానికి సంబంధించిన తేనెను అందజేశారు. ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి నల్లమల్ల ప్రాంతంలో ఉన్న పదర మండలం మద్దిమడుగు వద్ద ఉన్న కృష్ణానది వంతెన నిర్మాణం గురించి మంత్రికి వివరించారు. ఆ నిర్మాణం చేపడితే రెండు తెలుగు రాష్ట్రాల అంతరాష్ట్ర సంబంధాలు మరింత బలపడడంతో పాటు.. వ్యాపార పరంగా రవాణా వ్యవస్థ మరింత చేరువవుతుందన్నారు. ఈ వంతెన నిర్మాణం విషయంపై గత రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అంతర్ రాష్ట్ర సంబంధాల విషయంపై బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించాలని వినతి పత్రం అందజేశాన్నారు. ఎమ్మెల్యే తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరి నారాయణ గౌడ్, స్థానిక నాయకులు ఎండి రహీం, వెంకటరమణ, జాకీర్ తదితరులు ఉన్నారు.


Similar News