అద్దె చెల్లించలేదని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల భవనానికి తాళం

మండల కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఐజ మండలానికి మంజూరైంది.

Update: 2024-09-30 11:55 GMT

దిశ, ఎర్రవల్లి: మండల కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఐజ మండలానికి మంజూరైంది. అయితే ఐజలో సౌకర్యాలు లేని కారణంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో అద్దె భవనం తీసుకొని గురుకుల పాఠశాలను నడుపుతున్నారు. కాగా ఈ అద్దె భవనానికి 9 నెలల నుంచి అద్దె చెల్లించలేదని.. భవన యజమాని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా తాళం వేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం దిశ రిపోర్టర్ ఫోన్ లో వివరణ కోరగా ప్రిన్సిపాల్ రఘు బిల్డింగ్ యజమాని తో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.


Similar News