సొసైటీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా

పెంట్లవెల్లి మండల కేంద్రంలోని సొసైటీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని సోమవారం బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి పెంట్లవెల్లి కొత్త బస్టాండ్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

Update: 2024-09-30 13:22 GMT

దిశ, పెంట్లవెల్లి: పెంట్లవెల్లి మండల కేంద్రంలోని సొసైటీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని సోమవారం బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి పెంట్లవెల్లి కొత్త బస్టాండ్‌ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అంతకుముందు రైతులతో ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే మహా జనసభ నిర్వహించారు. రైతులకు ఎందుకు రుణమాఫీ కావడం లేదని చైర్మన్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ విజయ రామారావు మాట్లాడుతూ.. రైతులందరికీ రుణమాఫీ చేయాలని హైదరాబాద్‌కు వెళ్లి కమిషనర్ వినోద్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశామని.. పెంట్లవెల్లి సొసైటీలో 499 మంది రైతులు ఉన్నారని ఒక్క రైతుకు కూడా కాలేదని వారు ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లి స్పందించి పెంట్లవెల్లి సొసైటీలో రుణమాఫీ పూర్తి చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పోతుల వెంకటేష్, సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్, జ్ఞానేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు,


Similar News