వివాహితపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

వివాహితపై అత్యాచారయత్నం చేసిన సంఘటన గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-30 10:47 GMT

దిశ, గద్వాల రూరల్: వివాహితపై అత్యాచారయత్నం చేసిన సంఘటన గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లి గ్రామంలోని ఓ మహిళను గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గ్రామ కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. తాజాగా వివాహిత ఇంటి ఆవరణలో కాకరకాయలు తెంపుకుంటుండగా నిందితుడు బీరప్ప అనే వ్యక్తి మహిళలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అతన్ని ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం బాధితురాలు ఆమె భర్త సహాయంతో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


Similar News