ఎమ్మెల్యే సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక
ధన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఇతర యువకులతో పాటు నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి, కోటకొండ గ్రామాలకు చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సమక్షంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: ధన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఇతర యువకులతో పాటు నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి, కోటకొండ గ్రామాలకు చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సమక్షంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ముందంజలో ఉందని రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని ఇతర పార్టీలకు తెలంగాణలో తావులేదని గమనించే పలు పార్టీల నేతలు వలసలు వస్తున్నట్లు తెలిపారు.
Read More..
తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంది : ఎమ్మెల్యే బొల్లం