Joint Collector: ధరణి పెండింగ్ పనులను నెలలోగా పూర్తి చేయాలి

Update: 2024-08-08 12:26 GMT

దిశ, కొల్లాపూర్ (పెద్ద కొత్తపల్లి): ధరణి లో పెండింగ్ పనులను నెల లోగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామారావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన పెద్ద కొత్తపల్లి, కోడేర్ మండలాల తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ ధరణి లో సాంకేతిక లోపాలను తలెత్తకుండా ఆ దశగా చర్యలు తీసుకోవాలని తాసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యుసూప్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ తదితరులున్నారు.

Tags:    

Similar News