విద్యా ప్రమాణాలు పెంచాలి

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి వైద్య పరీక్షలు, జీవన్ జ్యోతి, సురక్ష యోజన బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

Update: 2024-09-27 10:18 GMT

దిశ, వీపనగండ్ల : స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి వైద్య పరీక్షలు, జీవన్ జ్యోతి, సురక్ష యోజన బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా పానుగల్, బండపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న డ్రైడే కార్యక్రమాలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తయిన వాటికి మెజర్మెంట్ బుక్ సిద్ధం చేసి సోమవారంలోగా ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారా లేదా? జీవన్ జ్యోతి, సురక్ష యోజన వంటి బీమా పూర్తయ్యాయా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమం అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మల్టీ పర్పస్ వర్కర్​కు వైద్య పరీక్షలు, బీమా చేయించి బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం పానుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల ఈడీడీ రిజిస్టరు, త్రైమాసిక ఏఎన్ సీ చెకప్, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. లేబర్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. బండపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, పానగల్ ఎంపీడీఓ గోవింద రావు, డీటీ అశోక్ ఉన్నారు.

Tags:    

Similar News