రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్

Update: 2024-10-25 06:04 GMT

దిశ, హన్వాడ : రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం లోని కొమిరెడ్డి పల్లి నుంచి హన్వాడ మండలం లోని షేక్ పల్లి వరకు రూ. 3 కోట్ల 45 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి. మహేందర్, టంకర కృష్ణయ్య యాదవ్, గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బొట్టు శ్రీను, యండి ఖలీమ్, పంచాయతీ రాజ్ డిఇ సంధ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News