ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,

Update: 2024-07-08 13:54 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పీ జానకి లు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిలిపే ప్రాంతాన్ని, అనంతరం రాష్ట్ర మంత్రులతో పాటుగా, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతో కలిసి ఉమ్మడి జిల్లా కు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించే సమావేశ మందిరాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే పలు అంశాలు,ఏర్పాట్లపైన పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి నర్సింహులు, డిపిఆర్ఓ శ్రీనివాసులు, డిఎఫ్ఓ సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,అధికారులు పాల్గొన్నారు.


Similar News