అడవి నుంచి దారి తప్పి వచ్చిన వన్యప్రాణి…కుక్కల దాడిలో మృతి
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవి ప్రాంతం నుండి కొన్ని జింకలు దారితప్పి అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని శివ సాయి నగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున సంచరించినట్లు స్థానికులు తెలిపారు.
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవి ప్రాంతం నుండి కొన్ని జింకలు దారితప్పి అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని శివ సాయి నగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుక్కలు దాటిని వేటాడుతూ దాడి చేయడంతో చుక్కల జింక మృతి చెందింది. జింక మృతి చెందిన విషయం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నప్పటికి సంఘటన స్థలానికి ఇంకా అటవీశాఖ అధికారులు ఎవరూ చేరుకోలేదని స్థానికులు తెలిపారు.