KTR : జ్వ‌రం నుంచి కోలుకున్న కేటీఆర్.. రేపు మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జ్వరం నుంచి కోలుకున్నారు.

Update: 2024-09-29 13:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జ్వరం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 72 గంట‌ల త‌ర్వాత జ్వ‌రం త‌గ్గిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్, అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు కేటీఆర్ వెల్లడించారు.

బుల్డోజ‌ర్ బెదిరింపుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు అరిక‌ట్టాలని, దాని కోసం తాము చేయ‌గ‌లిగినంత వ‌ర‌కు కృషి చేస్తామ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు శనివారం కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన జ్వరం నుంచి కోటుకోవడంతో వెల్‌కమ్ అన్న.. బాస్ ఈజ్ బ్యాక్, మేము వెయిట్ చేస్తున్నాము అన్నా అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


Similar News