Crop Loans: రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : KTR

కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-16 10:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ సక్సెస్ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన సక్సెస్ కాలేదు, వాల్ల కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగ సక్సెస్ అయిందంటూ కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసింది ఎంత అని ప్రశ్నించారు. ఇన్కమ్ టాక్స్ కట్టారని, రేషన్ కార్డు లేదని చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదని.. కేవలం రూ.22 లక్షల 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. అర్హులందరికీ రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి నిరూపిస్తే, తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. సెక్యూరిటీ లేకుండా ఏ నియోజకవర్గానికి అయినా మీడియాను తీసుకొని వస్తే.. రేవంత్ తో చర్చకు మేము సిద్దం అని సవాలు విసిరారు.  

Tags:    

Similar News