KTR: బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కు లేదు: మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఇవాళ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-26 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఇవాళ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెల్ల బంగారం తెల్లబోతోందని, పత్తి (Cotton) రైతులు దళారుల చేతుల్లో చిత్తవుతున్నారని ఆరోపించారు. ఓ వైపు సీసీఐ (CCI) తేమ శాతం, క్వాలిటీ అంటూ కొర్రీలు పెడుతూ.. రైతులను ఇబ్బందుకు గురి చేస్తుందని ఆరోపించారు. పండించిన పంటకు సాకులు చూపెట్టి కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసింది ఫైర్ అయ్యారు. అన్నదాతలు ఆగం అయితుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందిని కామెంట్ చేశారు.

క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌ (Formers Declaration)లో చెప్పి.. నేడు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఆ విషయంలో ఉలుకూ.. పలుకూ లేకుండా కూర్చుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి చొరవ తీసుకునే సమయం, శ్రద్ధ రెండూ కూడా లేవని అరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధి లేదని అన్నారు. ఇప్పటికే.. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని.. సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారని ఆక్షేపించారు. పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని.. ‘కర్షక ద్రోహి కాంగ్రెస్‌.. రైతు డిక్లరేషన్ బోగస్’ అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News