కాంగ్రెస్​ పాలనపై మాజీ ఎమ్మెల్యే వనమా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్​ పాలనపై కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-13 09:35 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : కాంగ్రెస్​ పాలనపై కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వనమా మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కార్యకర్తలపై దాడులకు దిగడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ సంఘటనకు నిరసనగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులను అక్రమంగా అరెస్ట్ చేయడం సహించరానిదన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కూడా దాడులు చేసే దమ్ముందన్నారు. కానీ తాము అలా చేయబోమని స్పష్టం చేశారు.

    దాడులతో బీఆర్ఎస్ వాళ్లను భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమైనట్టు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూసన వీరభద్రం, దామోదర్, కొట్టి వెంకటేశ్వర్లు, అన్వర్ పాషా, మాజీ ఎంపీపీ బుక్య సోనా పాల్గొన్నారు. 

Tags:    

Similar News