ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి మూసివేత

ఖమ్మం- సూర్యాపేట జాతీయ రహదారిని అధికారులు మూసేశారు.

Update: 2024-09-01 06:29 GMT

దిశ, కూసుమంచి: ఖమ్మం- సూర్యాపేట జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, జుజ్జుల్ రావు పేట సమీపంలోని హట్యాతండాలో పాలేరు జలాశయం అలుగు పోస్తండటంలో నేషనల్ హైవే 365బీబీపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఖమ్మం సూర్యాపేట రహదారి గుండా వెళ్లే భారీ వాహనాలు సైతం ఐదు కిలోమీటర్లు ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి వద్దకు చేరుకున్న జాతీయ రహదారిశాఖ అధికారులు, కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

 

 

 


Similar News