ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే

కరకగూడెం మండలం చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే పాయం

Update: 2024-09-30 13:51 GMT

దిశ, కరకగూడెం : కరకగూడెం మండలం చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. మొత్తం ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, అల్పాహారం, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హాస్టల్ లో భోజనం రుచిగా ఉండటం లేదని తెలియజేయడంతో, భోజనశాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు అయినటువంటి వంటలను రుచులు చూసి, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వలన నాసిరకం భోజన సదుపాయం అందుతుందని తెలియజేశారు.

దీనిపై ఎమ్మెల్యే పాయం వెంటనే స్పందించి హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు విద్యార్థులకు ఎటువంటి లోటు వచ్చిన వర్డెన్ పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టాలని హాస్టల్ వార్డెన్, హెచ్ఎంని ఆదేశించారు. విద్యార్థులకు హాస్టల్ లో ఏదైనా సదుపాయాలు కావాలంటే నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News