శేషగిరి నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శేషగిరి నగర్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2024-10-24 04:11 GMT

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శేషగిరి నగర్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ సతీష్ కుమార్, ఎస్సైలు రాజ్ కుమార్, మేడ ప్రసాద్ లతో కలిసి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఇందులో భాగంగా గల్లీ గల్లీని, ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని కోరారు.

యువత అతి వేగంగాతో వాహనాలను నడపొద్దంటున్నారు. అలాగే ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. అలాగే చదువు పై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News