వినాయక నిమజ్జన విధుల్లో ఉన్న సీఐ పై దాడి

ఖమ్మం పాత బస్టాండ్ వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న వన్ టౌన్ సిఐ ఉదయ్ పై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు.

Update: 2024-09-17 06:58 GMT

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం పాత బస్టాండ్ వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న వన్ టౌన్ సిఐ ఉదయ్ పై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఐ కుడి భుజానికి గాయం అయినట్లు తెలుస్తుంది. దాడి చేసిన నిందితులు సాయి స్వరూప్, డోన్ వాన్ అశోక్ , అరుణ్ , రవీంద్ర గా గుర్తించారు. కాగా ఈ ఘటనపై పై పోలీసులు బిఎన్ఎస్ 121 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


Similar News