రైతుల కష్టమంతా వృథా... మల్లాయిగూడెంలో ఎండిన పొలాలు

రైతుల కష్టమంతా వృథా అయింది. కూసుమంచి మండలం మల్లాయిగూడెంలో వరిపొలాలు నీరు లేక ఎండిపోయాయి.

Update: 2024-09-24 09:11 GMT

దిశ, కూసుమంచి : రైతుల కష్టమంతా వృథా అయింది. కూసుమంచి మండలం మల్లాయిగూడెంలో వరిపొలాలు నీరు లేక ఎండిపోయాయి. దాంతో ఎండిన పంటపొలాలను, ఎన్నెస్పీ కాలువను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య మంగళవారం పరిశీలించారు. ఇటీవల వర్షాలకు, వరద తాకిడికి పాలేరు రిజర్వాయర్ ఎన్నెస్పీ కాలువకు గండిపడడంతో ఐబీ అధికారులు నీటిని నిలిపివేశారు.

    దాంతో పొలాలు ఎండిపోతున్నాయి. అధికారులు కాలువ మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తిచేసి మంగళవారం కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో కూసుమంచి డివిజన్ అధికారిణి సరిత, కూసుమంచి మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి, జుజ్జులరావుపేట ఏఈఓ రవితేజ, రైతులు పడిశాల మైసయ్య, నరేష్, ముత్తయ్య, రామారావు పరిశీలించారు.

Tags:    

Similar News