చెట్టును ఢీకొట్టిన బైక్ .. ఇద్దరు మృతి
బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మద్దెలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, కరకగూడెం :బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మద్దెలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ..రేగళ్ల పంచాయతీ గోత్తికొయా మదనగూడెం గ్రామానికి చెందిన మడకం భద్రు (60 ), దంతేవడా పరాకాకాడి గ్రామానికి చెందిన హిమ్లా దేవ (27), రేగళ్ల గ్రామము నుంచి బైక్ పైవస్తుండంగా..మద్దెలగూడెం మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టుని ఢీకొని అక్కడిక్కడికి మృతి చెందారు. గమనించిన స్థానికుల సమాచారంతో.. ఎస్ఐ రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని..పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.