పురుగుల మందు తాగుతూ వీడియో కాల్..అప్రమత్తమైన స్నేహితులు

మల్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ

Update: 2024-10-22 06:30 GMT

దిశ, మల్యాల: మల్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ స్నేహితులకు గ్రూప్ వీడియో కాల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మల్యాల కు చెందిన బైరి చందు అనే అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం స్థానిక మల్లె గుట్ట ప్రాంతంలో పురుగుల మందు సేవించాడు. పురుగుల మందు తాగుతున్న సమయంలో స్నేహితులకు గ్రూప్ వీడియో కాల్ చేశాడు. స్నేహితుల వద్దని చెప్పిన వినకుండా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇటీవల గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన చందు అవి విఫలమవడంతో కుటుంబ కలహాలు జరిగినట్లుగా ప్రాథమికంగా తెలియవచ్చింది.


Similar News