ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-20 10:25 GMT

దిశ, చందుర్తి : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలంలోని జోగపూర్ గ్రామంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో 11 లక్షల 86 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ ఎంపీటీసీ మ్యాకల గణేష్, బొజ్జ మల్లేశం, కనకరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News