వైభవంగా శ్రీశాల వెంకన్న చక్రస్నానం

సిరిసిల్ల శ్రీశాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.

Update: 2024-10-18 15:25 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల శ్రీశాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆల యంలో మహా పూర్ణాహుతి, నివేదన కార్యక్రమాలతో పాటు స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీగా సాయంత్రం సిరిసిల్ల మానేరు నది తీరంలో శాస్త్రోక్తంగా స్వామివారికి వేద పండితులు చక్రస్నానం జరిపించారు. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణం, సప్తవరణ పూజ, ఏకాంత సేవతో పరిసమాప్తం కానున్నాయి. 

Tags:    

Similar News