అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-10-18 15:08 GMT

దిశ, జగిత్యాల టౌన్ : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 లక్షల 35 వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం 14 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. రూ.15 కోట్ల సీఆర్ఆర్ నిధులు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News