అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకం ధ్వంసం.. మాజీ సర్పంచ్

మండలంలోని నాగులపేట గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే శిలాఫలకం ధ్వంసం చేసారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ అన్నారు.

Update: 2024-06-18 11:00 GMT

దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని నాగులపేట గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే శిలాఫలకం ధ్వంసం చేసారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు అభివృద్ధి చేసే దమ్ములేక గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల శిలా ఫలకాలను పగలగొట్టి, ప్రజల, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారన్నారు.

దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మేం చేసిన పనుల కంటే, ఎక్కువ పనులు చేసి దాని పక్కన వారి పేర్లు పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలె కానీ ఇలాంటి పనులు చేతగాని దద్దమ్మలే చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఒదిలే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ ఇలాంటి పనులు పునరావృతం అయితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.


Similar News