జగిత్యాల టు ముంబైకి రైలు పున:ప్రారంభం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభం అయింది.

Update: 2024-10-20 15:21 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభం అయింది. ఈ మేరకు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, మరలా తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11:49కు జగిత్యాల చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. రైలు సర్వీస్ పున: ప్రారంభంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News