రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

Update: 2025-03-23 12:28 GMT
రైతులకు అండగా ప్రభుత్వం
  • whatsapp icon

దిశ, జూలపల్లి : రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం కొనరావుపేట, జూలపల్లి గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాలతో నష్టపోయిన పంటలను అధికారులతో, స్థానిక నాయకులతో, రైతులతో కలిసి పరిశీలించారు. రైతులను ప్రభుత్వమే ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలంలోని కోనరావుపేట, జూలపల్లి గ్రామాల్లో రైతుల వరి, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులు ఎప్పుడు నష్టపోయినా పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారు నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే రైతులందరూ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని, ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు తూములు, కాలువ గట్లను ధ్వంసం చేసి నీటిని వృథా చేయవద్దని, అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని అన్నారు. తప్పకుండా ప్రతి రైతుకు నీటిని అందించేందుకు సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News