ముగ్గురు పిల్లలతో పాటు వివాహిత అదృశ్యం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి హనుమాన్ నగర్ కు చెందిన ఓ వివాహిత తన కూతురు, ఇద్దరు కుమారులతో కలిసి అదృశ్యం అయింది.

Update: 2024-07-06 14:28 GMT

దిశ,కరీంనగర్ రూరల్ : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి హనుమాన్ నగర్ కు చెందిన ఓ వివాహిత తన కూతురు, ఇద్దరు కుమారులతో కలిసి అదృశ్యం అయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కొత్తపల్లి ఎస్సై ఎస్. సాంబమూర్తి తెలిపారు. వివరాల ప్రకారం హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత గోదా భాగ్యలక్ష్మి (40) కూతురు ఆదిత్య లక్ష్మి (12), విశ్వక్ సేన్ (8), అశ్వత్ కార్తికేయ (3)

    ఈనెల 3న రాత్రి ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దాంతో భర్త గోదా కృష్ణ బంధువులు, ఇతర ప్రాంతాల్లో ఆరా తీసినా ఆచూకీ లభించడం లేదని తెలిపారు. స్థానిక కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. 


Similar News