వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి
దిశ, వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా భక్తులు లేక బోసిపోయిన ఆలయ పరిసరాలన్నీ సోమవారం భక్తుల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా సందడిగా మారాయి.