చర్చనీయాంశంగా మారిన ఫిర్యాదులు..

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య రాజుకుంటుంటున్న నిప్పు చిలికి చిలికి గాలివానలా మారుతుంది.

Update: 2024-06-18 10:55 GMT

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య రాజుకుంటుంటున్న నిప్పు చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు వర్గాలు సోషల్ మీడియా లో ఒకరి పై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు కాస్త ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్లింది. మంగళవారం మొదట కాంగ్రెస్ వర్గానికి చెందిన నాయకులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో తమ నాయకుడు, మంత్రి పొన్నం ప్రభాకర్ మీద గత వారం రోజులుగా అసత్య పోస్టింగ్ లు పెడుతూ బద్నాం చేస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గం తమ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి అవినీతిని బహిర్గతం చేసినందుకే తమ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రెండు వర్గాలు చేరి కొంత మంది పేర్లు పెడుతూ వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఒకరేమో అధికార పార్టీ, మరొక రెమో ఎమ్మెల్యే.. వీరిపై ఎలా చర్యలు తీసుకోవాలి అన్న విషయమై పై అధికారులకు రిపోర్ట్ చేసినట్లు తెలిసింది. అధికారుల సూచనల ప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు. ఏదీ ఏమైనా వీరిద్దరి ఫిర్యాదు విషయం ప్రస్తుతం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది.


Similar News