ముస్లిం మైనారిటీ సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : ఎమ్మెల్యే కోరుకంటి

తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆ

Update: 2023-10-08 12:32 GMT

దిశ,గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం 21 వ డివిజన్ లో ముస్లింల కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పాలకుల ఎవరు ముస్లిం కబరిస్తాన్ నిర్మాణానికి చొరవ చూపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సకల వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. 20 లక్షల రూపాయల నిధులతో ముస్లిం ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర సభ ప్రసంగంలో రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు రామగుండాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారని రామగుండం అభివృద్ధి కోరుకునే వారంతా రాబోయే ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ నాయకులు హఫీజ్ అల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News