తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

Update: 2024-03-02 16:04 GMT

దిశ,వీణవంక : తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మండలంలోని బేతిఘల్ గ్రామానికి చెందిన తాటికొండ రమణారెడ్డి అతని భార్య ఇద్దరూ కలిసి గత నెల 27 న హైదరాబాదులోని తన బిడ్డ ఇంటికి వెళ్లి తిరిగి శనివారం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి బీరువా తెరిచి చూడగా 55 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Similar News