హైదరాబాద్ లో ప్రముఖ సంస్థ పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి సుజుకి హిరోషి భేటీ అయ్యారు. గురువారం సచివాలయంలో సీఎంతో పాటు సీఎస్ శాంతి కుమారిని సుజికి హిరోషి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుజుకి కి చర్చ జరిగింది. కాగా మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన జపాన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికాల కంపెనీ ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో తన ఆర్ అండ్ డీ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్ ఈ నిర్ణయం తీసుకుంది.