అంత ఏకపక్షమా..?.. పోలీసుల తీరుపై మల్లు రవి అసహనం

పొలీసులు పొలిటికల్ కమాండ్‌లో వర్క్ చేయడం సరికాదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు...

Update: 2023-09-29 14:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పొలీసులు పొలిటికల్ కమాండ్‌లో వర్క్ చేయడం సరికాదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అణిచివేత సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కేసీఆర్‌పై తిరుగుబాటు మొదలైందన్నారు. కాంగ్రెస్‌తోనే ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. గతంలో బ్రిటిష్ వాళ్ళు రోడ్లు, ఇండస్ట్రీ లు ఏర్పాటు చేసినా..స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేశారన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అదే జరుగుతుందన్నారు. బీఆర్ఎస్‌ను పాతరేస్తారన్నారు.

Tags:    

Similar News