భూమిలోంచి పొగలు
బంజారాహిల్స్ లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న 1980 మిలటరీ హోటల్ ఎదుట భూమి లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్ లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న 1980 మిలటరీ హోటల్ ఎదుట భూమి లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అక్కడికి వచ్చిన నడకదారులు, స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. లోపల ఉన్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్తో పొగలు వస్తున్నట్లు భావించారు. విద్యుత్ శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అసలేమి జరిగిందో జీహెచ్ఎంసీ అధికారులు ఆరాతీస్తున్నారు.