ప్రొటోకాల్ రగడ.. ఎల్బీనగర్​ఎమ్మెల్యే వర్సెస్​ మన్సూరాబాద్​ కార్పొరేటర్​

బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్బీనగర్

Update: 2025-03-17 07:27 GMT

దిశ,వనస్థలిపురం: బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మన్సూరాబాద్​డివిజన్​కార్పొరేటర్​, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ ​లీడర్​కొప్పుల నర్సింహ్మారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ నెల 12 న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కొబ్బరి కాయలు కొట్టారని కార్పొరేటర్​కొప్పుల నర్సింహ్మారెడ్డి, బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి గత బుధవారం ప్రెస్​మీట్​పెట్టి ప్రశ్నించారు. దీంతో ఈ రోజు అదే అభివృద్ధి పనులకు కొప్పుల కొబ్బరికాయ కొట్టారు. ‘శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారు’ అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ డివిజన్​నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు జక్కిడి రఘువీరా​రెడ్డి, కార్యకర్తలు కొప్పులను అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే హయత్​నగర్​సీఐ నాగరాజు గౌడ్​ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్​మెట్​పీఎస్​కు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పలు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్ కు చేరుకున్నారు.






సీఐ అత్యుత్సాహం సరికాదు..

హయత్​నగర్​ సీఐ నాగరాజు గౌడ్​ తీరుపై ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను పేర్లు అడిగి రఘువీర్​, నాగరాజులను బూతులు తిడుతూ కొట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల అత్యుత్సాహం సరి కాదని హితవు పలికారు. అధికార కాంగ్రెస్​, బీజేపీ ఏకమై సుధీర్​రెడ్డి , సుధీర్​రెడ్డి అనుచరులను ఏమీ చేయలేరని తస్మాత్​ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.


Similar News