ప్రొటోకాల్ రగడ.. ఎల్బీనగర్ఎమ్మెల్యే వర్సెస్ మన్సూరాబాద్ కార్పొరేటర్
బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్బీనగర్
దిశ,వనస్థలిపురం: బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మన్సూరాబాద్డివిజన్కార్పొరేటర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్కొప్పుల నర్సింహ్మారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ నెల 12 న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కొబ్బరి కాయలు కొట్టారని కార్పొరేటర్కొప్పుల నర్సింహ్మారెడ్డి, బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి గత బుధవారం ప్రెస్మీట్పెట్టి ప్రశ్నించారు. దీంతో ఈ రోజు అదే అభివృద్ధి పనులకు కొప్పుల కొబ్బరికాయ కొట్టారు. ‘శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారు’ అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ డివిజన్నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు జక్కిడి రఘువీరారెడ్డి, కార్యకర్తలు కొప్పులను అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే హయత్నగర్సీఐ నాగరాజు గౌడ్ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్పీఎస్కు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పలు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ కు చేరుకున్నారు.
సీఐ అత్యుత్సాహం సరికాదు..
హయత్నగర్ సీఐ నాగరాజు గౌడ్ తీరుపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పేర్లు అడిగి రఘువీర్, నాగరాజులను బూతులు తిడుతూ కొట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల అత్యుత్సాహం సరి కాదని హితవు పలికారు. అధికార కాంగ్రెస్, బీజేపీ ఏకమై సుధీర్రెడ్డి , సుధీర్రెడ్డి అనుచరులను ఏమీ చేయలేరని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.