ప్రొఫెసర్​ సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కి డొనేట్

ప్రొఫెసర్​ సాయిబాబా పార్థివ దేహాన్ని సోమవారం సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు

Update: 2024-10-14 13:37 GMT

దిశ, సికింద్రాబాద్: ప్రొఫెసర్​ సాయిబాబా పార్థివ దేహాన్ని సోమవారం సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. మెడికల్​ స్టూడెంట్స్​ వైద్య పరిశోధనల కోసం సాయిబాబా పార్థివ దేహాన్ని ఆయన సతీమణి వసంతకుమారి, కూతురు మంజీరా, సోదరుడు రాందేవ్​ లు కలిసి అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్​ఓడీ సుధారాణి, వైస్​ ప్రిన్సిపాల్​ రవిశేఖర్​ రావులకు అందచేశారు. కుటుంబ సభ్యులతో పాటు సీపీఐ కార్యదర్శి నారాయణ, పీఓడబ్ల్యూ నేత సంధ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News