Bandi Sanjay : రాహుల్ గాంధీ టెర్రరిస్ట్‌ల మద్దతు తీసుకుంటుండు

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ టెర్రరిస్టుల మద్దతు

Update: 2024-09-12 15:27 GMT

దిశ, బేగంపేట: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ టెర్రరిస్టుల మద్దతు తీసుకుంటున్నాడని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని మూడు ముక్కలు చేశారని... మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశాన్ని ఏడు ముక్కలు చేస్తారని దుయ్యబట్టారు.గురువారం సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బిజెపి నాయకులు మరియు శశిధర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ లతో కలిసి జనరల్ బజార్ లోని పలు వ్యాపారుల వద్దకు వెల్లి చరవాణి ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. అంతకు ముందు ఆయన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి,ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చాయని,రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజుల్లో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి స్వదేశ ఎన్నికల సంఘం పై విమర్శలు చేయడం సరికాదని, భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించడం వల్లే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కిఎన్నికల వ్యవస్థ పై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.సిక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేదని.. ఐ ఎన్ సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని సెటైర్ వేశారు.దేశద్రోహ వాక్యాలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో దేశం వదిలి వెళ్లాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17 పై రాష్ట్ర సర్కారు నిర్ణయం విడ్డూరం..

సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి డే ప్రజా పాలననా అనే సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరోగ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే ప్రజా పాలన నా అని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నడ్డి విరగొట్టారని, ఉద్యోగులకు ఇస్తామన్న పీఆర్సీ ఇవ్వకుండా మోసం చేశారని, రోడ్లమీద పసి పిల్లలను కుక్కలు పీక్కు తింటున్న పట్టించుకోవడంలేదని ఇదే ప్రజా పాలన అని అన్నారు. తాము హైడ్రా కు వ్యతిరేకం కాదని హామీలపై ప్రజలు నిరధిస్తుంటే వాళ్ళ దృష్టిని మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామా చేయడమే ప్రజా పాలన అని అన్నారు. పేద,మధ్యతరగతి ఇండ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని బండి స్పష్టం చేశారు.

Tags:    

Similar News