LB Nagar: బెల్టు షాపులపై దాడులు.. భారీగా మద్యం పట్టివేత
వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగియటంలో పోలీసుల కృషి అభినందనీయమని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ అన్నారు.
దిశ, ఎల్బీనగర్: వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగియటంలో పోలీసుల కృషి అభినందనీయమని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ అన్నారు. జోన్ పరిధిలో దాదాపు నలభై గంటలపాటు జరిగిన శోభా యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. ఒకవైపు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటంతోపాటు ఊరేగింపు రోజున మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో జోన్పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బెల్టు షాపులపై ప్రత్యేక బృందాలు దాడులు జరిపి పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలియచేశారు. మొత్తం 37 కేసులు నమోదు చేసి 959 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. దీని విలువ 5 లక్షల 37వేల నూటా యాభై అయిదు రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో 9 కేసులు నమోదు చేసి లక్షా 11వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సరూర్నగర్స్టేషన్పరిధిలో 2 కేసులు నమోదు చేసి 29 వేలు, చైతన్యపురి స్టేషన్లో 2 కేసులు రిజిష్టర్చేసి 50వేల నాలుగు వందల పది, నాగోల్స్టేషన్లో 5 కేసులు నమోదు చేసి 92వేలు, వనస్థలిపురం స్టేషన్లో 4 కేసులు పెట్టి 75వేల 320, హయత్నగర్స్టేషన్లో 7 కేసులు నమోదు చేసి 75వేల 675, మీర్పేట స్టేషన్లో 5 కేసులు నమోదు చేసి 81వేల 2వందలు, అబ్డుల్లాపూర్మెట్స్టేషన్లో 3 కేసులు నమోదు చేసి 22వేల 5వందల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలో బెల్టు షాపులు నడుపుతున్న పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.