AIG ఆస్పత్రిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

వైరల్ ఫీవర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్

Update: 2024-07-17 08:08 GMT

దిశ, శేరిలింగంపల్లి: వైరల్ ఫీవర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వచ్చిన కేటీఆర్.. సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏఐజీ డాక్టర్లను అడిగి సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.


Similar News