మియాపూర్‌లో కుంగిన రోడ్డు..తప్పిన ప్రమాదం

శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని

Update: 2024-09-13 14:11 GMT

దిశ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ప్రధాన రహదారిపై 10 అడుగుల మీరు భారీ గుంత ఏర్పడింది. వాహనాలు వెళుతున్న సమయంలోనే ఈ గుంత ఏర్పడడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీప్తిశ్రీ నగర్ నుండి గంగారం పెద్ద చెరువులోకి వెళ్లే ఈ నాలా పది అడుగుల లోతున్నా భారీగా ఉంది.

ఇందులో నుండి పెద్ద ఎత్తున మురుగునీరు ప్రవహిస్తుంది. స్కూల్ బస్సులు వచ్చే ముందు ఈ గొయ్యి పడింది. ఒకవేళ ఇందులో ఎవరైనా పడితే పరిస్థితి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నామికే వాస్తుగా పైపైన పనులు చేశారని, నాణ్యత లోపాల వల్లనే ఇలా జరిగిందని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రోడ్డుపై భారీ గొయ్యి పడిందన్న విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, హెచ్ ఎండబ్ల్యూఎస్ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు వేరే రోడ్డు మీదుగా మళ్లించారు. గతంలో వేసిన పైపులైన్ కుంగినట్లు ఉందని స్థానికులు చెబుతున్నారు.


Similar News