సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు : మంద కృష్ణ మాదిగ

సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు

Update: 2024-10-03 15:06 GMT

దిశ, ఖైరతాబాద్ : సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది ఆ తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్వాగతించారని గుర్తుచేశారు. డీఎస్సీ ఫలితాలు విడుదల చేశారు 9వ తేదీన నియామక పత్రాలు ఇస్తామన్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్షలు జరిగాయని చెప్పారు. వర్గీకరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

చట్ట సభలో ఇచ్చిన మాటకి విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం తీర్పు అనంతరం పంజాబ్ , తమిళనాడు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కమిటీ వేసి అనంతరం అమలు చేస్తామని రేవంత్ చెప్పారని .. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధిష్ఠానం ఒత్తిడి ఒకవైపు , ఇంకోవైపు రాష్ట్రంలో మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమల్లో వెనుకాడరని అన్నారు. 9వ తేదీన నల్ల జెండాలతో అన్ని జిల్లాలో నిరసన తెలపాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.


Similar News