నగరం నడిబొడ్డున మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నగరం నడిబొడ్డున చిరుత పులి సంచారం కలకలం రేపింది.

Update: 2024-10-18 15:16 GMT

దిశ, వెబ్‌డెస్క్/ శేరిలింగంపల్లి: నగరం నడిబొడ్డున చిరుత పులి సంచారం కలకలం రేపింది. కాంక్రీట్ జంగిల్ లా మారిన నగరంలో శుక్రవారం రాత్రి చిరుత సంచారంతో జనాలు ఒకింత ఆశ్చర్యానికి గురి కావడమే కాక.. ఆందోళనకు గురి చేసింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నడిగడ్డ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు చిరుత కోసం గాలిస్తున్నారు. నగరంలో అది మియాపూర్ ప్రాంతంలో చిరుత సంచరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు చిరుత ఎక్కడి నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో ఒక్కటి మాత్రమే ఉందా.. దీనితో పాటు ఇంకా చిరుతలు ఉన్నాయా అనేది ఆందోళనగా మారింది.


Similar News