ఆస్ట్రాలజీస్ట్ వేణు స్వామికి నాంపల్లి కోర్టు చురక..

ఆస్ట్రాలజీస్ట్ వేణు స్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.

Update: 2024-09-13 14:00 GMT

దిశ, జూబ్లిహిల్స్: ఆస్ట్రాలజీస్ట్ వేణు స్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుతోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా టీవీ5 మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. వేణు స్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని టీవీ5 మూర్తి ఆరోపించారు. ఈ పిటిషన్‌ పై విచారన జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణు స్వామి పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

వివాదాస్పద జ్యోతిష్యుడిగా వేణు స్వామికి పేరుంది. ఈయన సెలబ్రిటీ జాతకాల పేరుతో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు. ఇటీవల కూడా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంత, నాగ చైతన్య విడిపోయినట్లు గానే.. శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య కూడా విడిపోతారంటూ వేణు స్వామి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గ్రహబలం, పేరు బలం, జాతక బలం అని రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కామెంట్స్‌పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలు కూడా వేణు స్వామి కామెంట్స్‌పై మండిపడ్డారు. మహిళా కమిషన్ చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ కేసు వేశారు.

టీవీ5 మూర్తికి వేణుస్వామి కి గొడవకి కారణం...

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను కలిసాడని మార్ఫింగ్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వేణు స్వామి పోస్ట్ చేయగా.. పి ఎం ఓ ఆఫీస్ లో అలాంటిది ఏమీ లేదని రిప్లై ఇచ్చారని , అస్సాం ముఖ్యమంత్రి తో దిగిన ఫోటో మార్ఫింగ్ చేసి పీఎం మోడీ కలిశారని ఫేక్ వీడియో పెట్టినట్లు రుజువు చేసిన టీవీ5 మూర్తి పై కక్ష పెంచుకున్నరని వేణుస్వామి అదే నేపంలో మూర్తి పై కేసులు పెట్టారని మూర్తి ఆరోపణలు చేశారు. ఇక జర్నలిస్ట్ మూర్తి,మరొకరు తనను, తన భార్యను వేధిస్తున్నారని.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వేణు స్వామి, ఆయన భార్య ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తమకు ప్రాణ హాణీ ఉందని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.


Similar News