HYD : మరదలిని ప్రేమిస్తున్నాడని యువకుడి హత్య..
సికింద్రాబాద్ పరిధి బేగంపేట పాటిగడ్డలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
దిశ, వెబ్డెస్క్ : సికింద్రాబాద్ పరిధి బేగంపేట పాటిగడ్డలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరదలిని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్ను కత్తితో పొడిచి ఇజాజ్ చంపాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ను ఇజాజ్ చంపాడు. అనంతరం నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.