HYD : భార్య, 11 నెలల కుమార్తెను చంపి భర్త సూసైడ్

సికింద్రాబాద్ పరిధి బోయిన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2024-07-21 02:46 GMT

దిశ, వెబ్‌డెస్క్/ కంటోన్మెంట్ : బోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, 11నెలల పాపను హత్య చేసి భర్త సూసైడ్ చేసుకున్నాడు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హృదయ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. గణేష్, స్వప్న దంపతులు. వీరు తమ ముగ్గురు కుమార్తెలతో కలిసి న్యూ బోయిన్ పల్లి పెద్దతోకట్టలో నివాసం ఉంటున్నారు. గణేష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున గణేష్ భార్య స్వప్న, చిన్న కుమార్తె నక్షత్రలను గొంతు నులిమి హత్య చేసి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


Similar News