KTR : మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? మాజీ మంత్రి కేటీఆర్

రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-08-22 05:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? అని ప్రశ్నించారు.

రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకని ఎక్స్ వేదికగా తాజాగా ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డీజీపీకి ట్యాగ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News