ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు మృతి

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Update: 2024-07-13 05:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒడిశాలో బస్సు ప్రమాదం జరగగా.. నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పాతబస్తీ ఛత్రినాక నుంచి తీర్థయాత్రకు 23 మంది భక్తులు వెళ్లారు. బరంపురం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News