కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేయడంతో హైటెన్షన్ వాతావారణం నెలకొంది.

Update: 2024-06-22 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేయడంతో హైటెన్షన్ వాతావారణం నెలకొంది. కాచిగూడలోని కిషన్ రెడ్డి ఇల్లును విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బల్మూరి వెంకట్‌తో సహ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Similar News