మ్యాక్స్ మంతెనకు ఊరట.. ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేత
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ సంస్థ మ్యాక్స్ మంతెన గ్రూపుపై మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ సంస్థ మ్యాక్స్ మంతెన గ్రూపుపై మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాక్స్మంతెన గ్రూప్ప్రమోటర్రాజును నిర్ధోషిగా గుర్తించింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన జస్టిస్లక్ష్మణ్ఈ కేసులో విచారణను కొనసాగిస్తే అది మ్యాక్స్మంతెన గ్రూప్నకు న్యాయం చేయనట్టే అని వ్యాఖ్యానించారు. భోపాల్కు చెందిన ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్డిపార్ట్మెంట్ఓ ఈ టెండర్కు సంబంధించిన వ్యవహారంలో కేసులు నమోదు చేశారు. దీంట్లో పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.
అయితే, ట్రయల్కోర్టులో ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు నమోదు చేసిన కేసులు వీగిపోయాయి. కాగా, ఈ టెండర్ వ్యవహారంలో 80వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని, దీంట్లో మనీ లాండరింగ్చట్ట ఉల్లంఘటనలు జరిగాయన్న అనుమానంతో హైదరాబాద్జోన్ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్జారీ చేశారు. భోపాల్ ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే, ఈడీ అధికారులు మనీ లాండరింగ్జరిగినట్టుగా కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించ లేకపోయారు. ఈ క్రమంలోనే హైకోర్టు మ్యాక్స్మంతెన గ్రూప్పై ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.